బీహార్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కేసీఆర్ ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్తో కేసీఆర్ సమావేశయ్యారు. ఈ సందర్భంగా లాలూ ఆరోగ్య పరిస్ధితిని సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన అనారోగ్యం నుంచి కోలుకుని రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషించాలని కోరారు.
అవినీతి ఆరోపణల కారణంగా సుదీర్ఘ కాలం జైల్లో గడిపిన లాలూ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఇటీవలే బీజేపీతో మైత్రికి చెక్ చెప్పిన నితీశ్.. లాలూ నేతృత్వంలోని ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని కొత్త సర్కారును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నితీశ్ తన కొత్త కేబినెట్లో లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్కు డిప్యూటీ సీఎం పోస్టును ఇచ్చారు.
అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన లాలూ ప్రసాద్ యాదవ్.. రాజకీయాలను తన కుమారుడితో చేయిస్తున్నారు.
ఈ క్రమంలో సీఎం నితీష్ ఆధ్వర్యంలో జేడీయూతో పాటు లాలూ నేతృత్వంలోని ఆర్జేడీతో కేసీఆర్ సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.