తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది . గాల్వాన్ అమరవీరుల కుటుంబాలతో పాటు ,సికింద్రాబాద్ టింబర్ డిపో మృతుల కుటుంబాలకు బిహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో కలిసి ఆర్థికసాయం అందజేశారు.
ఆ తర్వాత తేజస్వి యాదవ్ తో కలిసి సీఎం కేసీఆర్ గోవింద్ సింగ్ జన్మస్థలం పాట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. అక్కడ గులాబీ పగిడి (తలపాగా), మెడలో కండువాతో కేసీఆర్ సరికొత్తగా కనిపించారు. సిక్కుల మాదిరిగా పగిడి ధరించిన కేసీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతూ వైరల్ గా మారాయి..