telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వాస్తు పిచ్చితో పాలన చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్: జీవన్ రెడ్డి

jeevan-reddy

తెలంగాణ సచివాలయ భవనాలను ప్రభుత్వం కూల్చివేస్తుండడం రాజకీయంగా దుమారం రేపింది. 2012-13లో పూర్తయిన భవనాలను ఇప్పుడు కూల్చివేయడం దారుణమని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. ప్రజలంతా కరోనా గురించి భయాందోళనలకు గురవుతుంటే… కేసీఆర్ మాత్రం సెక్రటేరియట్ పై దృష్టి సారించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వాస్తు పిచ్చితో పాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు.

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ కేసీఆర్ అందుబాటులో లేరని జీవన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ క్వారంటైన్ లో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో కరోనాపై గవర్నర్ నిన్న సమీక్ష నిర్వహించాలనుకున్నారని తెలిపారు. అయితే చీఫ్ సెక్రటరీ సహా అధికారులు ఎవరూ దీనిపై స్పందించలేదని విమర్శించారు.సచివాలయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉందని అందుకే ఆగమేఘాలపై ఈ రోజే సచివాలయాన్ని కూల్చేస్తున్నారని అన్నారు.

Related posts