తెలంగాణ ప్రభుత్వం ఒకే కుటుంబం కోసం పని చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకమైనదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తి పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆరేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు.
కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల నుంచి తెలంగాణను కాపాడుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. దక్షిణ భారతదేశంలోనే కరోనా విషయంలో హైదరాబాద్ డేంజర్ జోన్లో ఉందని తెలిపారు. 4 లక్షల మాస్కులు, 2 లక్షల 31 వేల పీపీఈ కిట్లను కేంద్రం నుంచి తెలంగాణకు పంపించామన్నారు. కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని దుయ్యబట్టారు.
వైఎస్ జగన్ అవినీతి రాజ్యానికి రాజు: ఎమ్మెల్సీ అశోక్ బాబు