నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ఎమ్మెల్యే, తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. స్వామివారికి కేజీ బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు.
లింబాద్రి లక్ష్మీనరసింహస్వామికి బంగారంతో చేతి తొడుగులు, ఆబారణాలు ప్రత్యేకంగా రూపొందించి అందజేశారు. బాజిరెడ్డి గోవర్థన్ సహా, కుటుంబ సభ్యుల్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతించి దర్శన ఏర్పాట్లు చేశారు.
బాజిరెడ్డి గోవర్థన్ సతి సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి, స్వామి వారికి కానుకలను అందజేశారు. కార్తీక మాసంలో ఆలయ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో బాజిరెడ్డి కుటుంబీకులు స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం: భట్టి