దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా కాంబినేషన్లో ఓ వెబ్సిరీస్ రాబోతోందంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ప్రసారంకానుందని కూడా తెలుస్తోంది. అయితే ఈ వెబ్సిరీస్కు సంబంధించి అధికారికంగా ప్రకటన రాలేదు. తాజాగా ఇదే అంశంపై మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ ఈ వెబ్సిరీస్లో ఓ కీలకపాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ ‘ఏమైంది ఈవేళ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత ‘సోలో’, ‘సుకుమారుడు’, ‘సరదాగా అమ్మాయితో’ వంటి చిత్రాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళం, మలయాళం సినిమాల్లోనూ నటించింది. 2013 డిసెంబర్లో ఆమె ముంబయికి చెందిన వ్యాపారవేత్త కరణ్ను వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం నిషా అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉంటోంది.
ఈ మధ్య నిషా అగర్వాల్ ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రీఎంట్రీ ప్రయత్నాల్లో భాగంగానే ఆమె పోస్టులు చేస్తోందని అనుకుంటున్నారు. ఈ వెబ్సిరీస్తో టాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వాలని చూస్తోందట. ఇప్పటికే వెబ్ సిరీస్ దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించగా దానికి ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వెబ్సిరీస్తో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాలని చూస్తోందట. పూర్తి వివరాలు తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
మాజీ భర్తపై హీరోయిన్ వ్యాఖ్యలు… చాలా బాధ పెట్టుకున్నాం… అందుకే ఈ నిర్ణయం