సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది “సరిలేరు నీకెవ్వరు” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులని అలరించింది. త్వరలో పరశురాం దర్శకత్వంలో మహేష్ ఓ చిత్రం చేయనున్నారు. మహేష్ - పరశురాం కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర వార్త హల్చల్ చేస్తుంది. ఈ సినిమాకి “సర్కార్ వారి పాట” అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. టైటిల్ని బట్టి చూస్తుంటే చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగుతుందని అర్ధమవుతుంది. మరి ఈ వార్తలో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.