సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్ను చిరంజీవి పుట్టినరోజు (ఆగస్ట్ 22) సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఆగస్ట్ 20న విడుదల చేస్తున్నారు. ఈ టీజర్కి జనసేనాని పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ వాయిస్ ఓవర్ ఫొటోలు విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా సోమవారం పవన్ వాయిస్ ఓవర్కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. అందులో “సైరా నరసింహారెడ్డి…” అనే పవర్ఫుల్ డైలాగ్ ను మాత్రమే ప్రోమోగా కట్ చేసి రిలీజ్ చేశారు. రీసెంట్గా విడుదలైన ఈ సినిమా మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. మరి మంగళవారం విడుదల కాబోయే టీజర్ ఎలా ఉండబోతుందననే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
previous post
ఏపీ మెజారిటీ ప్రజలు రోడ్ల మీదకు వస్తే హైదరాబాద్ పరిస్థితేంటి: శివాజీ