ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘దాక్కో దాక్కో మేక’ పాట విడుదలకు ముందే సోషల్ మీడియాలో రావడంపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అసహనం వ్యక్తం చేస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
లీక్ ఘటనపై అల్లు అర్జున్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. లీక్ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, షూటింగ్, ఎడిటింగ్ వద్దకు ఎవరి ఫోన్లు అనుమతించొద్దని చిత్ర బృందానికి స్పష్టం చేసినట్లు సమాచారం. 5 భాషల్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ‘పుష్ప’లో రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబరులో విడుదల కానుంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నిర్మాత వై.రవి శంకర్ లీక్ ఘటనపై స్పందిస్తూ దయ చేసి ఎవరూ ఇలాంటి పనులు చేయొద్దు. తర్వాత చాలా ఇబ్బందుల్లో పడతారు. ఏది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తేనే కిక్ ఉంటుంది. ముందుగా వస్తే దాని విలువ తెలియదు. తాజా ఘటనపై మాత్రం చాలా సీరియస్గా ఉన్నాం. నిందుతులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని అన్నారు.