సూపర్స్టార్ మహేష్ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్వైడ్గా విడుదలకానుంది. సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మూడు పాటలు మినహా సినిమా చిత్రీకరణ దాదాపూ పూర్తయ్యిందట. ఓ పాటను విదేశాల్లో మిగిలిన రెండు పాటలను సెట్స్లో చిత్రీకరిస్తారని సమాచారం. కాగా.. సినిమా యూనిట్ ప్రమోష్స్ను షురూ చేయడానికి సన్నాహాలు చేసుకుంటుంది. అందులో భాగంగా సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్కు సంబంధించి ఒక్కొక్క వీడియో తయారు చేసి విడుదల చేయాలనుకుంటున్నారట.
previous post