telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ ‘సలార్’ మూవీ పిక్ వైరల్ !

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్.  పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆర్​జీ3 పరిధిలోని 3 ఓపెన్​ కాస్ట్​-2 లో సలార్​ సినిమా షూటింగ్​ ఇటీవలే ప్రారంభించారు. బొగ్గుగని కార్మికుల నేపథ్యం ఉన్న ఈ సన్నివేశాలను చిత్రీకరించేందుకు సినిమా దర్శకుడు సింగరేణిలోని ఉపరితల గనులను పరిశీలించి షూటింగ్​ను ప్రారంభించారు. ఈ సినిమాలో విలన్ పాత్రలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి చేస్తున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  అయితే తాజాగా సలార్ విలన్‌గా మరో స్టార్ పేరు కూడా వినిపిస్తుంది. కన్నడ స్టార్ మధు గురుస్వామి ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమాలో విలన్‌గా చేయనున్నాడంట. ఇది ఇలా ఉండగా…సినిమా కథలో భాగంగా కిడ్నాప్ అయిన హీరోయిన్ ను హీరో ప్రభాస్ రక్షించే సన్నివేశాలను ఈ రగ్గడ్ ఏరియాలో చిత్రీకరించారట. హీరోయిన్ ను రక్షించే క్రమంలో ప్రభాస్ ఓ బైక్ మీద వెళ్ళే సన్నివేశానికి సంబంధించిన ఓ పిక్ ను యూనిట్ లోని వారు సెల్ ఫోన్ లో తీశారు. లీక్ అయిన ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘కేజీఎఫ్’ సినిమాతో జాతీయ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబినేషన్ లో రాబోతున్న తొలి చిత్రం కావడంతో ‘సలార్’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమా ‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిరగందుల్ నిర్మిస్తున్నారు.

Related posts