telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దీదీకి షాక్ ఇచ్చిన కేంద్రం…

దీదీకి షాక్ ఇచ్చింది కేంద్రం. 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అయిన‌ ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ సేవలను తాము ఉప‌యోగించ‌ద‌ల‌చుకున్నాం.. దీనికి కేబినెట్ నియామక కమిటీ ఆమోదం తెలిపింద‌ని ప‌శ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి కేంద్రం నిన్న సమాచారం పంపింది. కాగా, తక్షణమే రిలీవ్​ చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఈనెల 31న ఢిల్లీలోని డీవోపీటీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని బందోపాధ్యాయ్‌కు సూచించింది. అయితే అయ‌తే, మే 31 నాటికి ఆయనకు 60 ఏళ్లు నిండనున్నాయి… ఆయ‌న పదవీ విరమణ చేయాల్సి ఉంది.. కానీ, కరోనాను ఎదుర్కోనే అనుభవం ఉన్న దృష్ట్యా ఆయన సేవలను కనీసం 6 నెలల పాటు పెంచాలని కోరుతూ ఇప్ప‌టికే ప్రధానికి లేఖ రాశారు సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. ఈ మేరకు మూడు నెలల పదవీకాలాన్ని పొడగిస్తూ కేంద్రం ఈ నెల 24న ఆదేశాలిచ్చింది. అయితే యాస్ తుఫాన్‌పై స‌మీక్ష‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. బెంగాల్ సీఎం కోసం నిరీక్షించాల్సిన ప‌రిస్థితి రావ‌డం.. కేంద్రానికి మ‌రింత కోపం తెప్పించిన‌ట్టుంది. యాస్ తుఫాన్‌పై ప్ర‌ధాని నిర్వ‌హించిన సమావేశంలో పాల్గొనేందుకు నిరాకరించిన కొద్ది గంటల్లోనే ఈ కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి.. కానీ , ఈ వ్య‌వ‌హారాన్ని టీఎంసీ త‌ప్పుబ‌డుతోంది.. 

Related posts