తెలుగులో “భరత్ అనే నేను” చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఈ భామ హిందీలో “లస్ట్ స్టోరీస్” అనే వెబ్ సిరీస్ తో తనలోని హాట్ నెస్ బయటపెట్టి యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా… ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఇక ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన “అర్జున్ రెడ్డి ” రీమేక్ “కబీర్సింగ్” చిత్రంతో కెరీర్లో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది కియారా అద్వానీ. ప్రీతి పాత్రలో సహజనటనతో ఆకట్టుకున్నది. ఈ సక్సెస్తో బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం కియారా “గుడ్న్యూస్”, “లక్ష్మీబాంబ్”, “షేర్షా”, “మర్జావా” సినిమాలు చేస్తోంది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “లక్ష్మిబాంబ్” చిత్రాన్ని లారెన్స్ తెరకెక్కిస్తున్నారు. కియారా బాలీవుడ్లో మరో హారర్ కామెడీకి పచ్చ జెండా ఊపిందని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అఫీషియల్ ప్రకటన చేశారు మేకర్స్. బూల్ బులైయా 2 చిత్రంలో కియారా కథానాయికగా ఎంపికైందని టీ సిరీస్ తమ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. “బూల్ బులైయా” (తెలుగులో చంద్రముఖి)కి సీక్వెల్గా “బూల్ బులైయా-2” అనే చిత్రం అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ఈ చిత్రాన్ని కబీర్ సింగ్ మేకర్స్ భూషణ్ కుమార్, మూరద్ కేతని, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. జూలై 31, 2020న విడుదల కానున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
previous post
ఇండస్ట్రీలో “ఒకే ఒక్క ఛాన్స్…” అంటూ సంగీత షాకింగ్ కామెంట్స్