అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా, తగ్గినా అది దేశీయంగా పెట్రోల్ ధరలపై ప్రభావం చూపుతుంది. అయితే గత కొన్ని నెలలుగా పెట్రోల్ ధరలు పైసాపైసా తగ్గుతున్న విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోవటంతో పెట్రోల్ ధరలు కూడా పెరగటం మొదలయ్యాయి.
నేడు లీటరు పెట్రోలు ధరను 21 పైసల మేరకు, డీజిల్ ధరను 8 పైసల మేరకు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల క్రూడాయిల్ ధరలు స్వల్పంగా పెరిగిన నేపథ్యంలోనే ఓఎంసీలు ధరను పెంచాయి. పెరిగిన ధరల తరువాత ఢిల్లీలో పెట్రోలు ధర రూ. 68.50, డీజిల్ ధర రూ. 62.24గా ఉండగా, ముంబైలో పెట్రోలు ధర రూ. 74.16, డీజిల్ ధర రూ. 65.12గా ఉంది.