telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్ షర్మిల ఖమ్మం టూర్ వాయిదా

వైఎస్ షర్మిల ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఆమ్ కొత్త పెట్రీ పెట్టడం ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. అయితే ప్రస్తుతం వరుస భేటీలతో ఆమె సమాలోచనలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… వైఎస్‌ షర్మిల ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 21న భారీ ర్యాలీతో బయలు దేరి ఖమ్మం జిల్లాలో పర్యటించాలని షర్మిల నిర్ణయం తీసుకున్నారు. అయితే.. తాజాగా ఈ పర్యటన వాయిదా పడింది. ఎమ్మల్సీ ఎన్నికల తర్వాతే ఖమ్మంలో షర్మిల పర్యటించనున్నారు. మార్చి 14 తర్వాత షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. లోటస్‌పాండ్‌లో ప్రతి శుక్రవారం అభిమానులతో షర్మిల భేటీ కానున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా అభిమానులతో షర్మిల సమావేశాలు జరుపనున్నారు. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్‌ అభిమానులతో సమావేశమయ్యారు. పార్టీ ఏర్పాటుపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సెంటిమెంట్‌లో భాగంగా ముందుగా చేవెళ్ల నేతలతో షర్మిల భేటీ అయ్యారు.

Related posts