అందాల చందమామ కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. కాజల్ ఇటీవలే కోమలి, రణరంగం చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో “కోమలి” చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్లో ” ముంబై సగ” అనే చిత్రంలో జాన్ అబ్రహంతో రొమాన్స్ చేయనుందట. సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునీల్ శెట్టి, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించనున్నారని సమాచారం. ఆమె నటించిన “పారిస్ పారిస్” కూడా విజయం సాధిస్తుందని కాజల్ ధీమాగా ఉంది. మరోవైపు కమల్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “భారతీయుడు-2″లో నటిస్తోంది. ఇదీ కాక శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సూర్యతో జతకట్టనుంది కాజల్. “కాల్ సెంటర్” అనే మరో చిత్రంలో కూడా నటిస్తోంది. అయితే కాజల్ అగర్వాల్ తన కెరీర్లో ఇప్పటివరకు పౌరాణిక పాత్రలు పోషించింది లేదు. ‘మగధీర’ చిత్రంలో యువరాణిగా కనిపించినా అది జానపద పాత్రే. నయనతార, త్రిషల బాటలోనే లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో మెప్పించాలని కాజల్ భావిస్తోంది. ఆ దిశగా సీత పాత్రపై మక్కువ కనబరుస్తోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న వెబ్సిరీస్లో నటించేందుకు అంగీకరించింది. ‘ది ఫారెస్ట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్స్’ అనే పుస్తకం ఆధారంగా తీస్తున్న ఈ వెబ్సిరీస్లో ప్రధాన పాత్ర అయిన సీతగా కాజల్ నటించనుంది.
previous post