telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శర్వానంద్ కొత్త సినిమా పేరొంటో తెలుసా..?

శర్వానంద్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇటీవల జాను సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వా. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన ’96’ సినిమాకు రీమేక్ గావచ్చింది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమా తర్వాత శర్వానంద్  మాహా సముద్రం అనే సినిమా చేస్తున్నాడు . ఆర్ఎక్స్ 100 సినిమాతో హిట్ అందుకున్న అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. శర్వతోపాటు  సిద్దార్థ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు .ఈ సినిమాతర్వాత ‘శ్రీకారం’ అనే సినిమాను చేస్తున్నాడు. వీటితో పాటు మరో సినిమాను కూడా అనౌన్స్ చేసాడు ఈ యంగ్ హీరో. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ”ఆడాళ్లూ.. మీకు జోహార్లు” అనే సినిమాలో శర్వా నటిస్తున్నట్లు ప్రకటించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 25న తిరుపతిలో ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లు’ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘చిత్రలహరి’ ‘రెడ్’ వంటి సినిమాలను రూపొందించిన కిషోర్ తిరుమల ఈ సినిమాతో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం . త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

Related posts