తెలుగుజాతి ముద్దుబిడ్డ నందమూరి తారకరామారావు స్వర్గస్థులై నేటికి 26 ఏళ్లు అవుతుంది. ఆయన వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబీకులు, ఎన్టీ రామారావు అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
తాత ఎన్టీఆర్ పోలికలను పుణికిపుచ్చుకుని పుట్టిన జూ. ఎన్టీఆర్ కూడా ఆయనలానే స్టార్ గా ఎదిగి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే నేడు తాత వర్ధంతి సందర్భంగా తారక్ ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేశాడు.
“తెలుగు ప్రజల గుండెల్లో నాటికి నేటికి ముమ్మాటికీ ధ్రువ తార మీరే” అంటూ తాతను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ.. నేటికీ.. ముమ్మాటికీ.. ధ్రువ తార మీరే 🙏🏻 pic.twitter.com/msOmHdOtvl
— Jr NTR (@tarak9999) January 18, 2022
మరో మనవడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కూడా తాజాగా తాత కు నివాళులు అర్పించారు. అదే విధంగా బాలయ్య ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
జోహార్ NTR 🙏🏽🙏🏽 pic.twitter.com/VsnBBbyfU9
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) January 18, 2022
నాకు నచ్చిన వాళ్లతో పడుకుంటా… మీకు అంత దమ్ముంటే