కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికి ఈ వైరస్ సోకుతోంది. ఇప్పటికే దేశంలో చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. చాలా మంది ప్రజాప్రతినిధులు, ప్రముఖులు కూడా ఆ మహమ్మారి కరోనాకు బలయ్యారు. కరోనా మహమ్మారి సామాన్యుడినుంచి సెలబ్రెటీలు వరకు అందరిని వణికిస్తోంది. సినిమా రంగంలోను పలువురు కరోనా బారిన పడినవిషయం తెలిసిందే. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీలు ఈ మహమ్మారిని పడుతుండటంతో సామాన్యులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. బాలీవుడ్ తారలతో పాటు ఇటు టాలీవుడ్ సెలబ్రెటీలను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే బండ్ల గణేష్ రాజమౌళి, నాగబాబు, కీరవాణి, తమన్నా కోవిడ్-19 బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే . తాజాగా టాలీవుడ్ జంట రాజశేఖర్ , జీవిత కరోనా బారిన పడ్డారని తెలుస్తుంది. వరం రోజుల క్రితమే కరోనా సోకినప్పటికీ ఈ విషయం ఆలాస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీరు హోం క్వారెంటైన్లో ఉన్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక… క్షమాపణలు కోరిన బిగ్ బాస్ కంటెస్టెంట్