టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సాధించడానికి భారత మహిళా హాకీ జట్టు అడుగు దూరంలో నిలిచింది. ఒలింపిక్స్ క్వాలిఫయిర్స్ మ్యాచ్లో యూఎస్ఏను భారత్ 5-1 తేడాతో మట్టికరిపించింది. భువనేశ్వర్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలో రాణిసేన ప్రత్యర్థి జట్టుని బెంబేలెత్తించింది. 11 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా నాలుగు గోల్స్ కొట్టింది.
భారత క్రీడాకారిణుల్లో గుర్జిత్ కౌర్ 42, 51వ నిమిషాల్లో రెండు గోల్స్ చేయగా లిలిమ 28, శార్మిత దేవి 40, నవనీత్ కౌర్ 46వ నిమిషాల్లో తలో గోల్ కొట్టారు. ఆఖర్లో అమెరికా క్రీడాకారిణి ఎరిన్ గోల్ కొట్టడంతో యూఎస్ఏ ఖాతాను తెరవగలిగింది. రేపు జరిగే పోరులో అమెరికాను రాణిసేన చిత్తుచేసినా లేదా మ్యాచ్ను డ్రాగా ముగించినా భారత్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ యూఎస్ఏ మ్యాచ్ గెలిస్తే గోల్స్ లెక్కల ప్రకారం ముందుకెళ్లే జట్టును నిర్ణయిస్తారు.
నలుగురు ఎంపీలు గెలవగానే ఊహల్లో విహరిస్తున్నారు: ఉత్తమ్