telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం లేదు: సీపీఐ నేత చాడ

chada venkat reddy cpi

తెలంగాణలో 40 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న ప్రభుత్వం స్పందించకపోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ పై సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి బుద్ధి, జ్ఞానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు కుంటుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నరే అపాయింట్‌మెంట్‌ ఇచ్చినపుడు సీఎం కేసీఆర్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 40 రోజుల నుంచి జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వానికి కనీస ధ్యాస లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచారన్నారు.

Related posts