ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 95 మంది కోవిడ్ భారినపడి మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 16 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది మరణించారు. ఈ క్రమంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,001కి పెరిగింది.
రాష్ట్రంలో కొత్తగా 9,393 మందికి కరోనా నిర్ధారణ కాగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,396కి చేరింది. తాజాగా 8,846 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,35,218 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 87,177 మంది చికిత్స పొందుతున్నారు.