telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీలో కరోనా విలయం : ఈ పట్టణాలలో లాక్ డౌన్

ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9.42 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 6,096 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 948231 కు చేరింది. ఇందులో 905266 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 35592 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 20 మంది మృతి చెందారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విజయనగరం జిల్లాలో ప్రధాన పట్టణాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. బొబ్బిలిలో పాక్షిక లాక్ డౌన్ విధించారు అధికారులు. ఇందులో భాగంగా మధ్యాహ్నం రెండు గంటల నుండి వ్యాపార సంస్థలు మూసివేయనున్నారు. రేపటి నుంచి కురుపాంలో పాక్షిక లాక్ డౌన్ ఉండనుంది. అలాగే సోమవారం నుండి పార్వతీపురంలో మధ్యాహ్నం లాక్ డౌన్ విధించనున్నారు.

Related posts