ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 30న నిర్వహించిన ‘పాలిసెట్-2019’ ఫలితాలు గురువారం విజయవాడలో రాష్ట్ర సాంకేతిక విద్య అధికారులు విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లక్ష 31 వేల 931 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా లక్షా 24 వేల 899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ర్యాంకులను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశం కల్పించనున్నారు. ఫలితాల్లో 82 శాతం బాలురు, 87 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను www.rtgs.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
previous post
next post
అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారు..సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు