telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ మెసేజ్ కారణంగానే శ్రావణి ఆత్మహత్య ?

Shravani

బుల్లితెర నటి కొండపల్లి శ్రావణి (26) ఆత్మహత్య కేసు ఆమె స్నేహితులు దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డి (సాయి) చుట్టూనే తిరుగుతోంది. ఈ కేసును ఎస్ఆర్ నగర్ పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న దేవరాజ్, సాయికృష్ణలను పోలీసులు ఇప్పటికే విచారించారు. ఈ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేవరాజ్ పెళ్లి చేసుకోను అని చెప్పడంతో శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. పెళ్లి చేసుకోనంటూ శ్రావణికి దేవరాజ్ మెసేజ్ పంపించినట్టు పోలీసులు గుర్తించారు. దేవరాజ్ పంపిన మెసేజ్ చూసిన శ్రావణి తీవ్ర ఆవేదనకు గురైనట్టు పోలీసులు విచారణలో తేలింది. దేవరాజ్ పెళ్లి చేసుకోనని చెప్పడం, సాయికృష్ణను పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు శ్రావణిపై ఒత్తిడి తీసుకురావడంతో శ్రావణి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఎస్ఆర్ నగర్ పోలీసుల వద్ద ఉన్న దేవరాజ్, సాయికృష్ణ ఈరోజు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది.

Related posts