telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

టాస్‌కి దక్షిణాఫ్రికా కెప్టెన్ సబ్‌స్టిట్యూట్… ఇదెక్కడి విచిత్రం అంటున్న నెటిజన్లు

Toss

భారత్ గడ్డపై టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా టీమ్‌‌ కష్టాలు రాంచీలోనూ కొనసాగేలా కనిపిస్తున్నాయి. విశాఖపట్నం, పుణె టెస్టుల్లో టాస్ ఓడిపోవడంతో రాంచీ టెస్టులో టాస్ కోసం దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్.. బవుమా రూపంలో సబ్‌స్టిట్యూట్‌ని తెచ్చుకున్నాడు. అయినప్పటికీ సఫారీలకి లక్ కలిసిరాలేదు. వరుసగా మూడో టెస్టులోనూ టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసియా గడ్డపై చివరిగా ఆడిన 9 టెస్టుల్లోనూ కెప్టెన్‌గా డుప్లెసిస్ టాస్ ఓడిపోయి ఉండటంతో.. కనీసం రాంచీ టెస్టులోనైనా గెలవాలని అతను ఆశించాడు. ఈ మేరకు టీమ్ వైస్ కెప్టెన్‌గా ఉన్న బవుమాని టాస్‌ కోసం తన వెంట తీసుకొచ్చాడు. అయితే.. కోహ్లీ టాస్ ఎగురవేయగా.. బవుమా టాస్ చెప్పాడు. కానీ.. టాస్ భారత్‌కి అనుకూలంగా పడింది. దీంతో.. వరుసగా 10 టెస్టులోనూ దక్షిణాఫ్రికా టాస్ ఓడిపోయినట్లయింది. టెస్టు మ్యాచ్‌లో సగం ఫలితాన్ని టాస్ నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి రోజు పిచ్ ప్రెష్‌గా ఉంటుంది. కాబట్టి.. మొదట బ్యాటింగ్ చేసే జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది. ఇక నాలుగో ఇన్నింగ్స్ ఆడే జట్టుకి మాత్రం బ్యాటింగ్‌లో సవాల్‌ తప్పదు. అప్పటికి పిచ్‌పై పగుళ్లు ఏర్పడి.. బౌలర్లకి అనుకూలంగా మారుతుంది. అందుకే.. ఆసియాలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే ఎక్కువగా విజయావకాశాలు ఉంటాయి. తాజాగా వైజాగ్, పుణె టెస్టులోనూ తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టే నెగ్గింది.

Related posts