కమెడియన్, నటుడు ప్రియదర్శి తాజాగా మరో వెబ్ సిరీస్ కు రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అనుబంధం సంస్థ స్వప్న సినిమాస్ బ్యానర్లో ఓ వెబ్ సిరీస్ నిర్మితమవుతోంది. ‘కంబాలపల్లి కథలు’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఆదివారం ప్రారంభమైంది. పల్లెటూరి నేపథ్యంలో రూపొందనున్న ఈ సిరీస్ లో దర్శి ‘హైబత్’ అనే క్యారక్టర్ పోషిస్తున్నాడు. ఇంతకముందు చాలా సినిమాల్లో తెలంగాణా మాండలీకంలో మాట్లాడిన దర్శి మరోసారి అదే యాసతో ప్రేక్షకులను అలరిస్తాడని తెలుస్తోంది. ఇక “పెళ్లిచూపులు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రియదర్శి కమెడియన్ గా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారు. తెలంగాణా యాసలో ప్రియదర్శి చేసిన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక కమెడియన్ గానే కాకుండా హీరోగా ‘మల్లేశం’ ‘మిఠాయి’ అనే చిత్రాల్లో నటించి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఇటీవల వెబ్ వరల్డ్ లో కూడా అడుగు పెట్టాడు ప్రియదర్శి. అక్కినేని నాగార్జున (అన్నపూర్ణ స్టూడియోస్) మరియు జీ 5 కలిసి నిర్మించిన ‘లూజర్’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ప్రియదర్శి కెరీర్ స్టార్టింగ్ నుంచి విలక్షణమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు.
previous post
next post
మా ఎన్నికలపై దర్శకేంద్రుడు స్పందన….