telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్… 7 ఏళ్ళ క్రితం ఆగిపోయిన చిత్రం మళ్ళీ తెరపైకి ?

Pspk

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏడేళ్ళ క్రితం ఆగిపోయిన “కోబలి” సినిమాని తిరిగి సెట్స్ పైకి తీసుకువెళ్ళే ప్లాన్ లో ఉన్నారట. “అత్తారింటికి దారేది” సినిమా తరవాత పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఈ సినిమాని చేయాలనీ అనుకున్నారు. రాయలసీమ నేపధ్యంలో ఈ సినిమా సాగనుంది. అయితే ఆ సినిమా అనుకోకుండా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయింది. దీంతో వీరి కాంబినేషన్ లో “అజ్ఞాతవాసి” సినిమా రూపొందింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న “కోబలి”తో ముందుకు రావాలని అనుకుంటున్నారట. మరోవైపు త్రివిక్రమ్ ఈ ఏడాది అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఎన్టీఆర్ తో ఓ సినిమాని చేసేందుకు కమిట్ అయ్యాడు. ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా కావడం విశేషం. కాగా “అజ్ఞాతవాసి” సినిమా అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు పవన్ 26 వ చిత్రం, రీఎంట్రీ మూవీగా “వకీల్ సాబ్” అనే చిత్రం తెరకెక్కుతుంది. దాదాపుగా 90 శాతం షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేశారు పవన్… ఇక క్రిష్ తో చేయబోయే ఇప్పటికే కొంత భాగం చిత్రీకరించబడింది. ఇక ఆ తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాలను చేసేందుకు కమిట్ అయ్యాడు పవన్. మరి “కోబలి” సంగతేంటో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిందే మరి.

Related posts