telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌చ్చ‌లేని వ్య‌క్తి ఆయ‌న ఒక్క‌రే: రఘురామకృష్ణరాజు

Raghuramakrishnaraju ycp mp

సింహాచల దేవస్థానం భూముల విష‌యంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఫిబ్ర‌వ‌రిలో ఓ జీవో విడుద‌ల చేశార‌ని, అప్ప‌ట్లో అన్ని వ్య‌వ‌హారాలు స‌రిగ్గానే ఉన్నాయ‌ని చెప్పారు.

అశోక్‌గజపతిరాజు మ‌చ్చ‌లేని వ్య‌క్తి అని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌చ్చ‌లేని వ్య‌క్తి ఆయ‌న ఒక్క‌రేన‌ని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. అటువంటి వ్య‌క్తిని మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా తొలగించడం దురుద్దేశంతో కూడుకున్నదేన‌ని విమ‌ర్శించారు. ఇంత సంకుచిత స్వ‌భావం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు ఉంటుంద‌ని తాను అనుకోవ‌ట్లేద‌ని చెప్పారు.

అశోక్‌గజపతిరాజును తొలగించేందుకు సరైన కారణాలు ప్రభుత్వం చూపలేక పోయిందని ఆయ‌న చెప్పారు వందల ఏళ్ల సంప్రదాయాన్ని కాలరాసి ఆనంద గజపతిరాజు మొదటి భార్య రెండో కుమార్తెకు పదవి ఇచ్చారని చెప్పారు.

రాత్రికి రాత్రే సంచయితని ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా నియమించార‌ని విమ‌ర్శించారు. అక్కడ ప్రైవేటు వ్యక్తులను నియమిస్తున్నారని అన్నారు. సింహాచ‌లంలో దేవుడికి అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు.

Related posts