ఏపిలోని తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటనలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కల్తీ కల్లు తాగి ఐదుగురు మరిణించడంపై పలు అనుమానాలుతో లోతుగా విచారణ జరపగా.. కేవలం కల్తీ కల్లు సేవించడమే కారణం కాదని వివాహేతర సంబంధమని తేలింది.
వివరాల్లోకి వెళితే..
తూర్పుగోదావరి జిల్లాలోని రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో జీలుగ కల్లు తాగి ఇటీవల ఐదుగురు గిరిజనులు చనిపోయారు. దీనిపై పోలీసులు, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపాయి. ఐదుగురి ప్రాణాలు తీసిన జీలుగ కల్లు శాంపిల్స్ను సేకరించి వాటిని కాకినాడలోని అబ్కారీ శాఖ ప్రాంతీయ పరీక్షా కేంద్రానికి పరీక్షల కోసం పంపారు. గిరిజనులు తాగిన కల్లులో క్రిమి సంహారకం కలిసినట్లుగా నిపుణులు గుర్తించారు.
మృతుల్లో ఒకరైన గంగరాజు భార్యతో గ్రామ వాలంటీర్ వంతల రాంబాబుకు వివాహేతర సంబంధ ఉందని అందుకే సదరు వ్యక్తిని చంపటానికి రాంబాబు కావాలనే జీలుగ కల్లులో గడ్డిమందు కలిపినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. దీంతో నిందితుడు రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.