హైదరాబాద్ లోని పటాన్ చెరులో నారాయణ కాలేజి విద్యార్థిని సంధ్యారాణి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ సందర్భంగా సంధ్యారాణి మృతదేహాన్ని పోలీసులు తరలించే క్రమంలో ఆమె తండ్రి వారిని అడ్డుకున్నాడు. దాంతో శ్రీధర్ రెడ్డి అనే పోలీసు కానిస్టేబుల్ అతడిని బూటు కాలితో తన్నుతూ దురుసుగా ప్రవర్తించాడు.
ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ వ్యక్తి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది? అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి ఇప్పుడా కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్నారు. శ్రీధర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇటు ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంకెల గారడీ తప్ప కేటాయింపుల్లో చిత్తశుద్ధి లేదు: కళా వెంకట్రావ్