telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మరింత ఆలస్యంగా .. నిర్భయ దోషుల ఉరి..

nirbhaya accused petition on

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చడంపై న్యాయ సమీక్ష కోరుతూ నిర్భయ దోషుల్లో ఒకరైన ముకేష్‌ కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 17న ముకేష్‌ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. శత్రుఘ్న చౌహాన్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరించిన విధానంపై ఆర్టికల్‌ 32 ప్రకారం న్యాయ సమీక్ష కోరుతూ పిటిషన్‌ దాఖలు చేసినట్లు మనోజ్‌ తరపు న్యాయవాది వ్రిందా గ్రోవర్‌ తెలిపారు. గతంలో దాఖలు చేసుకున్న క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో..రాష్ట్రపతికి క్షమాభిక్ష దాఖలు చేసుకున్నాడు.

Related posts