telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఆసిఫాబాద్ : … ఆర్థికసాయం వద్దు.. ఎన్కౌంటర్ ముద్దు ..

New couples attack SR Nagar

జిల్లాలో మహిళపై దారుణ హత్యాచారానికి పాల్పడిన నిందితులను తక్షణమే శిక్షించాలని బాధితురాలి బంధువులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దిశ హత్యాచారానికి ఇచ్చిన ప్రాధాన్యతను దళిత మహిళకు ఇవ్వడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కేసులోని నిందితులను కూడా ఎన్‌కౌంటర్ చేయాలని జిల్లా వ్యాప్తంగా ప్రజలు, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇంతటి దారుణ ఘటన న్యాయశాఖ మంత్రి సొంత జిల్లాలోనే జరిగినా పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

ఈ ఘటనలో ఆర్థిక సాయం చేయడం కంటే.. నిందితులను ఎన్‌కౌంటర్ చేయడమే తమకు ఓదార్పు అని బాధితులు చెబుతున్నారు. నవంబర్ 24న ఎల్లా పటార్ వద్ద బాధిత మహిళపై షేక్ బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూమ్‌లు అత్యాచారం చేసి దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను అదే నెల 27న అరెస్ట్ చేశారు.

Related posts