దిశ ను అత్యాచారం చేసి కిరాతకంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలపై ఏపీ హోం మంత్రి సుచరిత స్పందించారు. నిందితులకు క్రూరమైన శిక్ష వేయాలని చెబుతున్న తరుణంలో రెండు బెత్తం దెబ్బలు చాలన్న పవన్ వ్యాఖ్యలపై మహిళలందరూ ఆలోచించాలని సుచరిత కోరారు. మహిళలకు భద్రత కరువవుతోందని ఆందోళన చేస్తుంటే ఒక పార్టీకి నాయకుడైన పవన్ ఇలా మాట్లాడటం తగదని అన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు మహిళలపై ఏపాటి గౌరవం ఉందో చెబుతుందని అన్నారు.
చట్టాలను గౌరవించాలని ఒకపక్క చెబుతూనే, చెమ్డాలు ఊడేట్టు నిందితులను కొట్టాలంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని విమర్శించారు. పవన్ వ్యాఖ్యలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఒకవేళ ఇలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే ఎలా వుంటుందనీ ఆలోచించుకుంటున్నారని అన్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రతకు పెద్దపీట వేశారని చెప్పారు. సైబర్ మిత్ర, మహిళా మిత్ర, బీ సేఫ్ యాప్ ను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. దిశ ఘటనతో జగన్ చలించిపోయారని మంత్రి వెల్లడించారు.
రజినీకాంత్ రాజకీయ ఎంట్రీపై భారతీరాజా కామెంట్స్