తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు రావట్లేదని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ శిల్పాకళావేదికలో టీఎస్ఐపాస్ వార్షికోత్సవ వేడుకల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ కారణాలతో తెలంగాణను కేంద్రం పట్టించుకోవట్లేదని అన్నారు. తెలంగాణలో చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఎక్కువగా నాగ్ పూర్ వైపే అభివృద్ధి చేసుకుంటున్నారని ఆరోపించారు.
రక్షణ, వైమానిక రంగాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని అన్నారు.టీఎస్ఐపాస్ అనేది సీఎం కేసీఆర్ మానసపుత్రిక అని కేటీఆర్ అన్నారు. పారిశ్రామిక కాలుష్యం లేని నగరంగా హైదరాబాద్ను మారుస్తున్నామని తెలిపారు. ఓఆర్ఆర్ వెలుపల కాలుష్య రహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కొత్త తరహా ఆలోచనలతో వచ్చే అందరికీ రాయితీలు ఇస్తామని తెలిపారు.