telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

వివాహంపై .. నటుడు మహేష్ బాబు అభిప్రాయం..

maheshbabu on marriage

టాలీవుడ్‌ నటుడు మహేశ్‌బాబు వివాహబంధం సాఫీగా సాగాలంటే ఆలుమగలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలని అన్నారు. తాజాగా ఆయన ‘వోగ్‌ ఇండియా’ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. నమ్రతతో తన వివాహబంధం గురించి ఈ ఇంటర్వ్యూలో మహేశ్‌ మాట్లాడుతూ.. ‘మా పెళ్లి జరిగి 14 ఏళ్లు అయ్యింది. మేము ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. వివాహబంధం బలపడాలంటే ఒకే ఒక్క రహస్యం.. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం. ఇంతటి గొప్ప విషయాన్ని నాకు నేర్పించింది మా నాన్న. ఇంటికి రాగానే ఆయన ఓ పెద్దహీరో అనే విషయాన్ని మర్చిపోతారు. మాతో చాలా సంతోషంగా గడుపుతారు.’ అని మహేశ్‌ తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ.. ‘నేను ఇప్పటివరకు ఇంతటి క్రమశిక్షణ, అంకితభావంతో ఉన్న వ్యక్తిని చూడలేదు. మహేశ్‌ పనిని, జీవితాన్ని రెండింటిని సమానంగా చూస్తాడు’ అని అన్నారు. 2000 సంవత్సరంలో విడుదలైన ‘వంశీ’ చిత్రంలో మహేశ్‌, నమ్రత కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఐదు సంవత్సరాల ప్రేమ తర్వాత వివాహబంధంతో వీరు ఒక్కటయ్యారు. వీరికి గౌతమ్‌, సితార జన్మించారు. మాజీ మిస్‌ ఇండియా నమ్రత శిరోద్కర్‌ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఆమె చివరిగా నటించిన చిత్రం ‘అంజి’. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఈ సినిమా 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Related posts