telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్ర విద్యుత్ బిల్లుతో రైతులు నష్టపోతారు: జగదీష్ రెడ్డి

jagadish reddy

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ బిల్లుతో రైతులు నష్టపోతారని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ బిల్లును తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం రూపొందించిన విద్యుత్ బిల్లు 2020 పై రాష్ట్రం అభిప్రాయాన్ని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అడిగారని తెలిపారు. అయితే, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రికి తేల్చి చెప్పినట్లు తెలిపారు.

ఈ బిల్లు వల్ల వినియోగదారులకు ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేశామన్నారు.సబ్సిడీ పొందుతున్న అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లు 2020తో రాష్ట్రాల ప్రయోజనాలు హరించబడుతాయని అన్నారు. ప్రైవేటు సంస్థలకు పూర్తిగా అప్పగించే ప్రయత్నం నడుస్తోందన్నారు.

Related posts