telugu navyamedia
క్రీడలు వార్తలు

అరుదైన ఘనత సాధించిన జడేజా…

ప్రస్తుతం భారత జట్టులో ఫుల్ ఫేమ్ లో ఉన్న భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరపున మూడు ఫార్మాట్లలో 50 మ్యాచ్ లు ఆడిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు జడేజా. అయితే ఇంతకముందు ఈ ఘనతను భారత మాజీ కెప్టెన్ ధోని అలాగే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రమే అందుకున్నారు. 32 ఏళ్ల తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టుతో తన 50వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో బ్యాట్ తో అలాగే బంతితో అద్భుతమైన ప్రదర్శన చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మూడు ఫార్మాట్లలో కనీసం 50 మ్యాచ్‌లు ఆడిన మూడో భారత క్రికెటర్‌గా నిలిచిన తర్వాత రవీంద్ర జడేజా ట్విట్టర్ వేదికగా బీసీసీఐ మరియు అతని సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశం కోసం మొత్తం 3 ఫార్మాట్లలో 50 ఆటలను ఆడిన ఇతరులలో మాహి భాయ్ మరియు విరాట్ చేరడం చాలా గొప్ప గౌరవం. నాపై విశ్వాసం చూపించినందుకు బిసిసిఐ, నా టీమ్ మేట్స్, అద్భుతమైన సహాయక సిబ్బందికి పెద్ద ధన్యవాదాలు. జై హింద్! “అని ఎంఎస్ ధోని మరియు విరాట్ కోహ్లీలతో కలిసి తన చిత్రాలతో పాటు ట్వీట్ చేశాడు.

Related posts