ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీని తలపెట్టింది. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. అయితే ర్యాలీకి పోలీసులు అనుమతిని నిరాకరించారు. చంద్రబాబు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. లోకేష్ బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
చంద్రబాబు తిరుపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలను చేపట్టారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్, ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు.