telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

డిసెంబర్ కి ముందే భారత్ లోకి ఆ వైరస్…?

కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసింది.  అయితే, ప్రస్తుతం యూకే లో కరోనా మహమ్మారి రూపం మార్చుకొని కొత్త స్ట్రెయిన్ గా మార్పులు చెందింది.  ఇది పాత వైరస్ కంటే 70శాతం వేగంగా విస్తరిస్తోంది.  ఇండియాలోకి కూడా ఈ వైరస్ వ్యాపించింది.  ఇప్పటికే ఇండియాలో 20 కేసులు నమోదయ్యాయి. దీనిపై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కొన్ని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఇండియాలోకి ఈ వైరస్ డిసెంబర్ కి ముందే వచ్చి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు.  యూకేలో సెప్టెంబర్ లోనే ఈ వైరస్ మార్పులు చెందుతూ వచ్చిందని, ఇండియాలో నవంబర్ చివరిలో లేదంటే డిసెంబర్ మొదటివారంలో వ్యాపించి ఉండొచ్చని అన్నారు.  ఇతర దేశాల్లో కూడా ఈ వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అదనంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.  ప్రస్తుతం ఇండియాలో నమోదైన కేసులు తక్కువగానే ఉన్నాయని, డిసెంబర్ లో యూకే కొత్త స్ట్రెయిన్ గురించి ప్రకటన చేయక ముందే హాలెండ్ లో కొత్త స్ట్రెయిన్ కేసు నమోదైనట్టు రణదీప్ గులేరియా పేర్కొన్నారు.  దీనిని బట్టి ఇండియాలోకి డిసెంబర్ కు ముందే కొత్త స్ట్రెయిన్ ప్రవేశించి ఉండొచ్చని అన్నారు.

Related posts