ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పొరపాటు చేస్తున్నాడని, తన చెట్టుని తానే నరుక్కుంటున్నాడని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాజ్యసభలో విజయసాయి రెడ్డి సీబీఐ ఎంక్వైరీ కోరితే కేంద్ర మంత్రి అవసరం లేదని చెప్పారని గుర్తు చేశారు.పునరావాసంలో అవకతవకల గురించి జీవీఎల్ ప్రస్తావిస్తే.. పోలవరానికి ఎంత ఇస్తారని రమేష్ అడిగారని తెలిపారు.
వాళ్లల్లోనే వాళ్లకు పొంతన లేకుండా పోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరానికి ఫైనాన్స్ క్లియరెన్స్ రాలేదన్నారు. ఆర్అండ్ఆర్ రాష్ట్ర పరిధిలోనిదేనని కేంద్రం అంటోందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదన్నారు. కియా పరిశ్రమను వైఎస్ తెచ్చారని వైసీపీ మాట్లాడుతోందని బాబు వ్యాఖ్యానించారు.