ఒకవైపు కరోనాపై ప్రపంచమంతా యుద్ధం చేస్తుంటే మరోవైపు కొంతమంది మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. ఆఖరికి క్వారంటైన్లో ఉన్న మహిళలను కూడా వదలడం లేదు. తాజాగా క్వారంటైన్లో ఉన్న ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్తాన్లోని సవాయి మాధోపూర్ బటోడా పోలీస్ స్టేషన్లో జరిగింది. గత గురువారం రాత్రి ఈ ఘటన జరుగగా ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్కు చెందిన ఓ మహిళ లాక్డౌన్ కారణంగా మాధోపూర్లో ఉండిపోవాల్సి వచ్చింది. నెల రోజులు అయినా లాక్డౌన్ తొలగించకపోవడంతో చివరకు చేసేదేమి లేక కాలినడకన సొంతూరుకు బయలు దేరింది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆమె మాధోపూర్కు చేరుకోగా.. స్థానికులు అడ్డుకొని బటోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉంచారు. ఇదే అదునుగా భావించిన ముగ్గురు యువకులు అర్థరాత్రి పాఠశాలకు చేరుకొని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
previous post