వైద్యురాలి హత్య కేసు నిందితుల కోసం షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఎదురైన నిరసనలు.. చర్లపల్లి జైలు వద్ద కూడా కొనసాగుతున్నాయి. ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితులను తమకు అప్పగించాంటూ కొంత మంది యువకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులతో యువకులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వారిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తన పోలీసులు రంగంలోకి దిగారు. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
దీంతో జైలు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆందోళనకారులను నిలువరించేందుకు జైలు వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నలుగురు నిందితులను హైసెక్యూరిటీ బ్లాక్లో ఉంచినట్లు జైలు అధికారుల సమాచారం. ఇలాంటివి జరిగినప్పుడు ఆందోళనలు చేయడం సహజమైనప్పటికీ, కాస్త అధికారులకు సమయం, ప్రైవేసి ఇస్తే వాళ్ళపని(వేసేస్తారు) వాళ్ళు చేసుకుంటారు. హడావుడి చేస్తే, రక్షణ ఎక్కువ చేస్తుంటారు అంతే!