జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ రోజు ఉదయం సోఫియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. బోన్బజార్లో ఉగ్రవాదులు తల దాచుకున్నారని ముందస్తు సమాచారంతో అక్కడ కూంబింగ్ నిర్వహించారు.
ఈ క్రమంలో బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటన స్థలంలో ఉగ్రవాదుల ఆయుధాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడిచిన ఐదేళ్లలో జమ్మూకశ్మీర్లో 960 మంది ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు ఇటీవలే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి లోక్సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే.