telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

బ్రేకింగ్ : 139 మంది అత్యాచారం కేసు : డాలర్ బాయ్ అరెస్ట్

ARREST crime

139 మంది తనపై అత్యాచారం చేశారని ఆగస్టు 20 న పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేసిన కేసు సైబర్ క్రైమ్ కు ట్రాన్స్ఫర్ అయ్యిందని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసు సీసీఎస్ కు బదిలీ అయిందని తెలిపారు డీసీపీ అవినాష్ మహంతి. ఈ కేసు ఆరోపణలు ఎదుర్కున్న కొంత మందిని ఇప్పటికే విచారించమని..ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ శేకర్ అలియాస్ డాలర్ బాయ్ ని అరెస్ట్ చేసామన్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అవినాష్ మహంతి. ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని..ఈ కేసులో ప్రమేయం ఉన్నా వారి పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసును మహిళా ఏసీ పిస్తా అధికారులతో విచారణ జరుపుతున్నాము అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. బాధిత మహిళ నుండి ఇప్పటికే స్టేట్మెంట్ రికార్డ్ చేశామని..టెక్నికల్ అనాలసిస్ ద్వారా దర్యాప్తు చేశామని తెలిపారు సైబర్ క్రైమ్ డీసీపీ అవినాష్ మహంతి. 

Related posts