ఏపీలో రైతు భరోసా పథకం కింద ఇచ్చిన నగదు కోసం అన్మదమ్ముల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారితీసింది. విశాఖపట్టణం జిల్లాలోని హుకుంపేట మండలం రంగశీలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
తన వాటా డబ్బులు అడిగిన తమ్ముడి కుటుంబంపై ఆగ్రహించిన అన్నయ్య కృష్ణ తన నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తమ్ముడి భార్య కొండమ్మ చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. స్థానికుల సాయంతో కొండమ్మను చికిత్స నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.