మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ..లైంగిక దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ మార్పు కనిపించడం లేదు. మృగాళ్ళు రెచ్చిపోతున్నారు.
తాజాగా హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం ఓ యువతిపై ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. కోఠి నుంచి జూబ్లీహిల్స్ కు వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కింది. మార్గమధ్యలో ఆటో డ్రైవర్ తన స్నేహితులకు ఫోన్ చేసి వారిని ఆటోలో ఎక్కించుకున్నాడు.
ఆ తరువాత ఆ యువతిని జిల్లెలగూడ గాయత్రినగర్ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ సదరు యువతి మీద ముగ్గురు యువకులు కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అఖిల్, నితిన్, ప్రశాంత్, శీనులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.