telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మేయర్ బొంతు రామ్మోహన్ కు షాక్..

Bonthu Rammohan ghmc

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలు హ్=జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే టీఆర్ఎస్ దూకుడు పెంచింది. జిహెచ్ఎంసి కార్మికులకు జీతాలు పెంచింది. ఆస్తిపన్నులో రాయితీ కల్పించింది. అటు టీఆర్ఎస్ నేతలు ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం ఉదయం చెర్లపల్లి డివిజన్ వెళ్లారు. అయితే అక్కడ మేయర్ బొంతు రామ్మోహన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఈ రోజు ఉదయం చర్లపల్లి డివిజన్ లో వరద సాయం పంపిణీకి మేయర్ బొంతు రామ్మోహన్ వెళ్లారు. ఈ సందర్బంగా స్థానికులు మేయర్ ను నిలదీశారు. ఇన్నేళ్ళలో ఎప్పుడైనా తమ వద్దకు వచ్చారా? తమ డివిజన్ లో అభివృద్ధి పనులు ఎందుకు చేయలేదు ? అంటూ కాలనీ వాసులంతా మేయర్ ను ప్రశ్నించారు. వరద సాయం కూడా తమకు సరిగ్గా అందలేదని కాలనీ వాసులంతా మేయర్ తో చెప్పారు.

Related posts