కేటీఆర్ను సీఎం చేస్తారనే వార్తలు ఈ మధ్య కాలంలో బాగానే పెరిగిపోయాయి. సొంత పార్టీ నేతలే.. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అంటున్నారు. నిన్న కూడా మంత్రి తలసాని నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం కేటీఆర్ను సీఎం చేయాలని తమ డిమాండ్ను తెలిపారు. సీఎం కేసీఆర్ త్వరలోనే పదవి నుంచి తప్పుకుని కేటీఆర్ను సీఎంని చేయబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే.. తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఇవాళ దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్కు కంగ్రాట్స్ అంటూ పద్మారావు పేర్కొన్నారు. సికింద్రాబాద్లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరయ్యారు. అయితే.. కేటీఆర్ సమక్షంలో… బహుశా త్వరలోనే కాబోయే సీఎం కేటీఆర్కు శాసనసభ, రైల్వే కార్మికుల తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు డిప్యూటీ స్పీకర్ పద్మరావు అన్నారు. దీంతో అక్కడే ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేశారు.
previous post
next post