రానా, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “విరాటపర్వం 1992”. “నీది నాది ఒకే కథ” ఫేం వేణు ఊడుగుల చిత్రానికి దర్శత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటిస్తోంది. ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1990ల నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా ఈ మూవీని వేణు తెరకెక్కించనున్నాడు. పీరియాడిక్ సోషల్ డ్రామాగా రూపొందనుంది. వైజాగ్కి చెందిన అలనాటి బాలీవుడ్ నటి జరీనా వాహబ్ కూడా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడట. అలానే టబు పాత్ర కూడా కాస్త నెగెటివ్ షేడ్ లో ఉంటుందట. ఆయన పుట్టినరోజు శనివారం (డిసెంబర్ 14) ఆయన నటిస్తోన్న లేటెస్ట్ మూవీ “విరాట పర్వం” నుండి ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వేణు ఊడుగుల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తుంది. “రెవల్యూషన్ ఈజ్ ఎన్ యాక్షన్ ఆఫ్ లవ్” అంటూ ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో రానా ముఖానికి ఎర్ర గుడ్డ చుట్టుకుని ఉన్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఓ ఇన్టెన్సిటీ కనపడుతుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది.
previous post
next post